హైదరాబాద్ : తెలంగాణ పోలీసు విభాగానికి చెందిన సీఐ కోరిపల్లి సృజన్రెడ్డికి రాష్ట్రపతి అవార్డు దక్కింది. ఈ విషయాన్ని సోమవారం సాయత్రం కేంద్ర హోం శాఖ ప్రకటించింది. 40 మంది ప్రాణాలను రక్షించే ఆదర్శప్రాయమైన చర్యలకుగాను 72 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్.. జీవన్ రక్షా పదక్ అవార్డులను ఇవ్వడానికి ఆమోదం తెలిపారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట సమీపంలో ఉన్న మడిపల్లి గ్రామంలో ఉన్న ఓ బావిలో చెత్తచెదారాన్ని తీసేందుకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు ఆక్సిజన్ అందక అపస్మారక స్థితిలోకి వెళ్లారు. విషయం తెలుసుకున్న సీఐ సృజన్రెడ్డి ఒక్క పరుగున మడిపల్లికి చేరుకుని మరో ఆలోచన చేయకుండా బావిలోకి దిగి మరిపెల్లి రాము, మల్లయ్యను బయటకు తీశారు. ఇన్స్పెక్టర్ ధైర్యసాహసాలను డీజీపీ మహేందర్రెడ్డితోపాటు పలువురు ఉన్నతాధికారులు ప్రశంసించారు. 2019 మే నెలలో ఇద్దరు కార్మికుల జీవితాలను కాపాడేందుకు పాడుబడిన బావిలోకి దిగిన సీఐ సృజన్రెడ్డి చర్య ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఇదే ఆదర్శప్రాయమైన చర్య ఇప్పుడు దేశంలో అత్యున్నత పురస్కారం ఉత్తమ్ జీవన్ రక్షక్ పదక్ అవార్డుకు ఎంపికయ్యేలా చేసింది.
Mon Jan 19, 2015 06:51 pm