హైదరాబాద్ : తెలంగాణలో మందు బాబులకి శుభవార్త చెప్పింది ప్రభుత్వం. రాష్ట్రంలో కొత్తగా 159 బార్లు ఓపెన్ చేసేందుకు కాను ఈ రోజు నోటిఫికేషన్ జారీ చేశారు. కొత్త మున్సిపాలిటీల్లో ఈ బార్ లు ఏర్పాటు చేసేందుకు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 55 బార్లకు పర్మిషన్ లభించింది. ఈ రోజే నోటిఫికేషన్ విడుదల కాగా ఈ రోజు నుండే దరఖాస్తుల స్వీకరణ కూడా మొదలయింది. ఫిబ్రవరి 8వ తేదీ వరకు అప్లికేషన్లు స్వీకరించనున్నారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లాలలో ఫిబ్రవరి 10న డ్రా తీయనున్నారు. జీహెచ్ఎంసీలో మాత్రం 11న ఎక్సైజ్ డైరెక్టర్ ఆధ్వర్యంలో డ్రా తీయనున్నారు. డ్రా పొందిన వారికి 17న క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇస్తారు, బార్ క్లియరెన్స్ వచ్చిన 90 రోజుల్లోపు మొత్తం ఎక్సైజ్ ట్యాక్స్లోని ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ చెల్లించాలి. 159 బార్లకు అప్లికేషన్ల ఫీజులతోపాటు, ఎక్సైజ్ ట్యాక్స్ రూపంలో 50 కోట్లకు పైగా ఆదాయం లభిస్తుందని అంచనా.
Mon Jan 19, 2015 06:51 pm