హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మేక పిల్లను రక్షించబోయి ఓ యువకుడు ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిష్టారెడ్డి పేటలో జరిగింది. గ్రామానికి చెందిన షేక్ అసద్ (18) ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. మేక పిల్లకు జబ్బు చేయడంతో పశువుల దవాఖానకు తమ్ముడు షేక్ అలీబాబాతో కలిసి మేక పిల్లలను తీసుకొని బయల్దేరాడు. మార్గమధ్యలో మేక పిల్లలను వీధి కుక్కలు వెంబడించడంతో పరిగెత్తుతూ వెళ్లి సమీపంలోని చెరువు పడిపోయింది. దీన్ని గమనించిన అసద్ మేక పిల్లలను రక్షించేందుకు చెరువులోకి దూకాడు. ఈత రాకపోవడంతో నీట మునిగాడు. అలీబాబా కేకలు వేయడంతో స్థానికులు ఘటనాస్థలానికి చేరుకొని మేక పిల్లను రక్షించారు. అసద్ను మాత్రం రక్షించలేకపోయారు. మృతుడి బాబాయి ఎండీ ముజాహిద్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయాలు నెలకొన్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm