శ్రీకాకుళం: జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదుపు తప్పిన బస్సు డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 12 మంది గాయాలతో తృటిలో బయటపడ్డారు. గాయాలైనవారిని అక్కడున్న స్థానికులు ఇచ్చాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ఇచ్చాపురం మండలం బెల్లుపడ టోల్ ప్లాజా వద్ద చోటు చేసుకుంది. కూలీలతో కలిసి విశాఖపట్నం నుంచి బీహార్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి..కేసు నమోదు చేసుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm