హైదరాబాద్: ఇండియాలో ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు కొత్త కొత్త రూల్స్ తెస్తున్నాయి. ఈసారి మందు బాబులు టార్గెట్ అయ్యారు. ఈ కొత్త రూల్స్తో వారికి ఎంత తాగినా కిక్ ఎక్కడం కష్టమే.
మద్యం అమ్మాలంటే వైన్ షాపులకు లైసెన్స్ ఉండాలి. కానీ ఇంట్లో మద్యం ఉంచుకోవాలంటే కూడా లైసెన్స్ ఉండాలంటే షాకింగ్ విషయమే. ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఈ కొత్త ఆదేశం జారీ చేసింది. ఎవరైనా సరే ఇళ్లలో మద్యాన్ని నిల్వ చేసుకోవాలంటే... తప్పనిసరిగా ప్రభుత్వం నుంచి లైసెన్స్ తీసుకోవాలి. మద్యం కొనడానికీ, రవాణా చేసుకోవడానికీ అన్నింటికీ ఈ లైసెన్స్ అవసరమే.
ఇలా మద్యం దాచుకోవడానికి ఇచ్చే లైసెన్సును ప్రతి సంవత్సరం రెన్యువల్ చేయించుకోవాలి. ఈ లైసెన్సును జిల్లా కలెక్టర్ ఇస్తారు. మందుబాబులు ఎలాగూ ఏడాదికి పైగా మద్యం తాగుతారు కాబట్టి... రెన్యువల్ చేయించుకోవడం తప్పనిసరి అవుతుంది. తాజా రూల్స్ ప్రకారం ఎవరైనా సరే తమ ఇళ్లలో 6 లీటర్ల వరకే మద్యాన్ని ఉంచుకోవచ్చు. అంతకంటే ఎక్కువ దాచుకోవాలనుకుంటే... లైసెన్స్ తీసుకోవాల్సిందే. ఈ లైసెన్స్ ఫ్రీగా ఇవ్వరు. దీనికి సంవత్సరానికి రూ.12,000 చెల్లించాలి. అలాగే... సెక్యూరిటీ డిపాజిట్ రూ.51,000 ఇవ్వాలి. ఇవన్నీ చెల్లించేంత గొప్ప ఆర్థిక పరిస్థితుల్లో సామాన్య మందుబాబులు ఉంటారని అనుకోలేం. అందువల్ల మద్యాన్ని ఎప్పటికప్పుడు కొనుక్కోవడం మేలు.
ఉత్తరప్రదేశ్లో కరోనా రూల్స్లో భాగంగా లిక్కర్ షాపులను ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే తీయడానికి అనుమతిస్తున్నారు. మద్యంపై ఎక్కువ ఆదాయం రాబట్టుకోవాలని ప్రయత్నిస్తున్న రాష్ట్రాల ప్రభుత్వాలకు యూపీ ప్రభుత్వ నిర్ణయం బాగా నచ్చుతుంది. మిగతా రాష్ట్రాలు కూడా ఈ రూల్ తెచ్చాయంటే... లిక్కర్ లవర్స్కి ఇబ్బందే.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Jan 26,2021 07:51AM