హైదరాబాద్: తమిళనాడులోని కోయంబత్తూర్ జిల్లాలో నాటుబాంబు పేలుడు కలకలం సృష్టించింది. రిపబ్లిక్ డే వేడుకలకు ముందు బాంబు పేలుడు చోటు చేసుకోవడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. పెరినాయికెన్పాలయం సమీపంలోని జ్యోతిపురం గ్రామం నందిని కాలనీలో ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిని అదే కాలనీకి చెందిన మణిమళన్, కే రాజు, రామరాసు, పుంతిరాయ్గా పోలీసులు గుర్తించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ఇంట్లో నాటుబాంబులు తయారు చేస్తుండగా పేలుడు సంభవించినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. ఘటనాస్థలానికి బాంబు స్క్వాడ్ బృందం, బాంబు నిర్వీర్యం చేసే నిపుణులు చేరుకొని తనిఖీ చేశారు. అడవి పందులను వేటాడేందుకే వీరు బాంబులను తయారు చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm