హైదరాబాద్: త్వరలోనే బీజేపీ పనైపోతుంది.. రాసిపెట్టుకోండని సీపీఐ సీనియర్ నేత నారాయణ అన్నారు. బీజేపీ నేతల బండారం త్వరలోనే బయటపడుతుందని పెర్కొన్నారు. చాలా మంది నుంచి కోట్ల రూపాయలు తీసుకున్నారని నారాయణ అన్నారు. విశాఖ స్టీల్ప్లాంట్ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ఆస్తి అని చెప్పారు. లేఖలు రాయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. స్టీల్ప్లాంట్ విషయంలో రాజకీయ పార్టీలన్నీ ఏకం కావాలన్నారు.