హైదరాబాద్ : చైనాకు చెందిన ఓ యువతి ఆపిల్ ఐఫోన్ 12 ప్రో మాక్స్ ఆర్డర్ చేసింది. ఆన్లైన్లోనే 1500 డాలర్లు(భారత కరెన్సీలో రూ.1,10,231) బిల్లు కూడా చెల్లించింది. ఆమె ఇంటి ముందు పార్శిల్ లాకర్లో డెలివరీ బాయ్ ఓ బాక్స్ను ఉంచి వెళ్లిపోయాడు. తర్వాత దాన్ని ఎంతో ఆతృతగా ఓపెన్ చేసిన ఆ యువతి లోపల యాపిల్ జ్యూస్ కనిపించడంతో ఒక్కసారిగా షాక్ అయ్యింది. యాపిల్ ఐఫోన్ ఆర్డర్ చేస్తే యాపిల్ ఫ్లేవర్డ్ డ్రింక్ రావడమేంటని మండిపడింది. తనకు జరిగిన అన్యాయం గురించి ఆమె మాట్లాడిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటనపై యాపిల్తో పాటు ఎక్స్ప్రెస్ మెయిల్ సర్వీసెస్ స్పందిస్తూ కస్టమర్ చెప్పిన ప్రదేశానికి ఫోన్ను ఆర్డర్ చేశామని పేర్కొన్నాయి. దీంతో డెలివరీలో ఏ పొరపాటు జరిగి ఉండకపోవచ్చని, కానీ ఆమె ఇంటి ముందు పార్శిల్ లాకర్లో పెట్టిన తర్వాత దుండగులు ఎవరైనా దాన్ని మార్చేసి ఉండొచ్చేని భావిస్తున్నారు. రంగంలోకి దిగిన స్థానిక పోలీసులు ఐఫోన్ ఎలా మాయమైందన్న దానిపై దర్యాప్తు చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm