హైదరాబాద్ : నగరంలోని పాతబస్తీలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. భవాని నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడేళ్ల ఎత్తేశ అనే బాలుడిని మేనత్త దారుణంగా చంపేసింది. మేనత్త అయేషా ఎత్తేశను భవనంపై నుండి కింద విసిరేసి చంపింది. మేనత్త అయేషాకు వివాహం జరిగి రెండు సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు ఆమెకు సంతానం కలగనట్టు తెలుస్తోంది. దీంతో తన కళ్లముందే ఆ బాలుడు ఆడుకోవడం తట్టుకోలేక ఈ ఘాతుకానికి పాల్పడినట్టు భావిస్తున్నారు. దీంతో పోలీసులు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. నిందితురాలు అయేషాను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm