నవతెలంగాణ-భిక్కనూర్
మండల కేంద్రంలోని శ్రీ రేణుకా దేవి 45వ వార్షికోత్సవంలో భాగంగా మంగళవారం రేణుకా దేవి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగింది. రేణుక దేవి కల్యాణ మహోత్సవానికి ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ హాజరై కళ్యాణ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గౌడ సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గాల్ రెడ్డి, జెడ్పిటిసి పద్మ నాగభూషణం గౌడ్, పట్టణ సర్పంచ్ తునికి వేణు, ఉప సర్పంచ్ బోడ నరేష్, ఆత్మ కమిటీ చైర్మన్ నరసింహారెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు భగవంత రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ రామచంద్రం, సిద్ది రామేశ్వర ఆలయ చైర్మన్ మహేందర్ రెడ్డి, ఎంపీటీసీ సాయ గౌడ్, నాయకులు బొండ్ల శేఖర్, రాజబాబు గౌడ్, రాజలింగం,పట్టణ పార్టీ అధ్యక్షుడు ముదాం సత్తయ్య, గౌడ సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Mar 02,2021 06:48PM