- మాజీ దళ కమాండర్ కోరం వెంకటేశ్వర్లు అలియాస్ గణేషన్న
నవతెలంగాణ-గుండాల
జనశక్తి, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీలలో 14 సంవత్సరాలు అజ్ఞాత జీవితం గడిపి 2017 లో డిఎస్పి వీరేశ్వరరావు ఎదుట లొంగి పోయానని,, సరెండర్ సర్టిఫికెట్ ఇచ్చినప్పటికీ పునరావాసం కల్పించకపోగా, జనజీవన స్రవంతిలో కలిసిన తర్వాత తన జీవనాధారమైన తనకున్న 5 ఎకరాల భూమి చుట్టూ ఫారెస్ట్ అధికారులు ట్రంచ్ కొట్టడం కారణంగా పునరావాసాన్ని కోల్పోయానని తన భూమి తనకు ఇవ్వడంతోపాటు పునరావాసం కల్పించాలని మాజీ దళ కమాండర్ కోరం వెంకటేశ్వర్లు, అలియాస్ గణేషన్న డిమాండ్ చేశారు ఈ విషయమై మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తన కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడారు. తన 5 ఎకరాల భూమి తనకు ఇవ్వడంతో పాటు పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్న పోడు రైతులందరికీ పట్టాలు వచ్చే విధంగా చూడాలని కోరుతూ సమ్మక్క సారక్క మాల ధరించి గత 25 రోజులుగా వివిధ మండలాల్లో ప్రదర్శనలిస్తూ సంఘీభావం కోరుతూ తిరగడం జరిగిందని చెప్పారు. ఈ విషయంపై త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవనున్నట్లు తెలిపారు
నవతెలంగాణ-గుండాల
జనశక్తి, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీలలో 14 సంవత్సరాలు అజ్ఞాత జీవితం గడిపి 2017 లో డిఎస్పి వీరేశ్వరరావు ఎదుట లొంగి పోయానని,, సరెండర్ సర్టిఫికెట్ ఇచ్చినప్పటికీ పునరావాసం కల్పించకపోగా, జనజీవన స్రవంతిలో కలిసిన తర్వాత తన జీవనాధారమైన తనకున్న 5 ఎకరాల భూమి చుట్టూ ఫారెస్ట్ అధికారులు ట్రంచ్ కొట్టడం కారణంగా పునరావాసాన్ని కోల్పోయానని తన భూమి తనకు ఇవ్వడంతోపాటు పునరావాసం కల్పించాలని మాజీ దళ కమాండర్ కోరం వెంకటేశ్వర్లు, అలియాస్ గణేషన్న డిమాండ్ చేశారు ఈ విషయమై మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తన కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడారు. తన 5 ఎకరాల భూమి తనకు ఇవ్వడంతో పాటు పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్న పోడు రైతులందరికీ పట్టాలు వచ్చే విధంగా చూడాలని కోరుతూ సమ్మక్క సారక్క మాల ధరించి గత 25 రోజులుగా వివిధ మండలాల్లో ప్రదర్శనలిస్తూ సంఘీభావం కోరుతూ తిరగడం జరిగిందని చెప్పారు. ఈ విషయంపై త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవనున్నట్లు తెలిపారు