హైదరాబాద్ : సౌదీ అరేబియాలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయ నర్సులు మృతి చెందారు. ఈ ఘటన ఆదివారం సౌదీలోని తైఫ్లో చోటుచేసుకుంది. నర్సులను తీసుకెళ్తున్న మినీ బస్సు ప్రమాదానికి గురికావడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో భారత్కు చెందిన అఖిల(29), సుబి(33) అనే ఇద్దరు నర్సులు ప్రమాదస్థలంలోనే మృతిచెందారు. కాగా, మృతులను కేరళకు చెందినవారిగా అధికారులు గుర్తించారు. అఖిలది వైకోమ్ వంచియూర్ అని, సుబిది కోల్లాం అని తెలిపారు. నర్సులు తమ క్వారంటైన్ పీరియడ్ను ముగించుకుని జెడ్డా నుంచి రియాద్కు తిరిగి వస్తున్న క్రమంలో ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. బస్సు రోడ్డు మీద నుంచి పక్కన ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో అఖిల, సుబితో పాటు మరో ఇద్దరు భారతీయ నర్సులు అన్సీ, ప్రియాంక కూడా ఉన్నారు. వీరికి స్వల్ప గాయాలు కావడంతో ప్రస్తుతం తైఫ్లోని కింగ్ ఫైజల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm