హైదరాబాద్ : న్యాయవాది వామన్రావు దంపతుల హత్య బాధ కలిగించినట్లు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ లీగల్ సెల్ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. న్యాయవాదులు తెలంగాణ ఉద్యమానికి అండగా నిలిచారన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే వారినే సీఎం కేసీఆర్ అడ్వకేట్ జనరల్గా నియమించినట్లు తెలిపారు. హైకోర్టు విభజన కోసం ప్రధాని మోడీని సీఎం కేసీఆర్ ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశారు. హైకోర్టు విభజన తర్వాతనే తెలంగాణకు న్యాయం జరిగిందన్నారు. వామన్రావు దంపతుల హత్య బాధకలిగించిందన్న మంత్రి హత్య కేసులో ఆరోపణలు వచ్చిన నేతను పార్టీ నుంచి తక్షణమే తొలగించినట్లు తెలిపారు. అదేవిధంగా హత్యతో ప్రమేయం ఉన్న వారికి కఠిన శిక్ష పడేలా చేస్తామన్నారు. శాంతిభద్రతల విషయంలో సీఎం కేసీఆర్ కఠినంగా ఉన్నారన్నారు. న్యాయవాదుల రక్షణ చట్టం కోసం తప్పకుండా కృషి చేస్తామన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm