హైదరాబాద్: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. తిరువనంతపురంలో ఆయన తొలి డోసు టీకాను వేయించుకున్నారు. సిక్కిం రాష్ట్ర గవర్నర్ గంగా ప్రసాద్తో పాటు ఆయన భార్య తొలి డోసు టీకాను తీసుకున్నారు. గ్యాంగ్టక్లోని ఎస్టీఎన్ఎం హాస్పిటల్లో వారు వ్యాక్సిన్ వేసుకున్నారు. ఇక మేఘాలయా గవర్నర్ సత్య పాల్ మాలిక్ కూడా తొలి డోసు కోవిడ్ టీకాను తీసుకున్నారు. ఆయన షిల్లాంగ్లో ఆ టీకా వేసుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm