హైదరాబాద్: అమెరికా దక్షిణ కాలిఫోర్నియాలో మంగళవారం ఉదయం ఎస్యూవీ, ట్రక్కు ఢీకొన్న ఘటనలో 13 మంది చనిపోయారు. 12 మంది గాయపడ్డారు. అయితే ఈ కేసులో మరో కోణం ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా - మెక్సికో సరిహద్దుల్లో ప్రమాదం జరగడం వల్ల మానవ అక్రమ రవాణా జరుగుతుందా అన్న అనుమానం తతెత్తుతుంది. ప్రమాదానికి గురైన ఎస్యూవీలో 25 మంది ప్రయాణికులు ఉండటం పలు అనుమానాలుకు దారితీసింది. మృతుల్లో ఎక్కువ మంది మెక్సికన్లు కావడం మరో విషయం. వారంతా 15 నుంచి 53 ఏళ్లు లోపు వారేనని అధికారులు ధ్రువీకరించారు. మెక్సికన్ విదేశీ విభాగానికి చెందిన రాబర్టో వెలస్కో కూడా 10 మెక్సికన్లు చనిపోయినట్లు ట్వీట్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm