- జెడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు
నవతెలంగాణ నవీపేట్
ప్రజలతో మమేకమైతేనే పదవికి విలువ ఉంటుందని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు అన్నారు. మండలంలోని కమలాపూర్ గ్రామంలో అంకాలమ్మ పోలేరమ్మ దేవాలయాన్ని కలెక్టర్ నారాయణ రెడ్డి తో కలిసి బుధవారం ప్రారంభించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో పోరాట ఫలితం, సీఎం కేసీఆర్ కటాక్షం వలన తనకు డిప్యూటీ మినిస్టర్ లాంటి జడ్పీ చైర్మన్ పదవి వరించిందని అన్నారు. దానికి అనుకూలంగానే అహర్నిశలు ప్రజలతో మమేకమై ఎందుకు కృషి చేస్తున్నానని అన్నారు. గ్రామంలో ఎండోమెంట్ ద్వారా ఇచ్చిన 20 లక్షలు కాకుండా సుమారు 60 లక్షలతో అతిపెద్ద అంకాలమ్మ పోలేరమ్మ గుడిని నిర్మించడం పట్ల గ్రామస్తులను, ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ సోమయ్య ను అభినందించారు. మహిమాన్విత మైన ఆలయాన్ని నిర్మించడం వల్ల గ్రామ ప్రజల సంక్షేమంతో పాటు పశుసంపద పెరగాలని టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రామ్ కిషన్ రావు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సూరమ్మ ఎంపీపీ సంఘం శ్రీనివాస్, ఏ టి ఎస్ శ్రీనివాస్, నర్సింగ్ రావు ఎంపీటీసీ జనార్ధన్, బుచ్చన్న, ఆలయ కమిటీ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, సభ్యులు మూరరెడ్డి, మల్లీశ్వరి రెడ్డి, రమేష్ రెడ్డి, సత్యనారాయణ రావు మరియు గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Mar 03,2021 04:49PM