హైదరాబాద్ : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న స్వామివారిని 50 వేల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారని, హుండీ ద్వారా రూ. 2.95 కోట్ల ఆదాయం లభించిందని టీటీడీ అధికారులు ప్రకటించారు. సుమారు 25 వేల మంది తలనీలాలు సమర్పించారని తెలిపారు. దూర ప్రాంతాల నుంచి ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసి వచ్చే వారికి ప్రత్యేకంగా దర్శనం టికెట్లను విక్రయిస్తుండటంతో, ఆ కోటా విడుదలైన గంటల వ్యవధిలోనే ముగిసిపోతుండటం గమనార్హం.
Mon Jan 19, 2015 06:51 pm