హైదరాబాద్: రాష్ట్రంలోని ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే తెలంగాణ స్టేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్పీజీఈసీఈటీ) షెడ్యూల్ విడుదలయ్యింది. పీజీఈసెట్ దరఖాస్తు ప్రక్రియ ఈనెల 12 నుంచి ప్రారంభంకానుంది. ఈ పరీక్షలను సీబీటీ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) పద్ధతిలో జూన్ 19 నుంచి 22 వరకు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ రేపు వెలువడనుంది. ఈనెల 12 నుంచి ఏప్రిల్ 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆలస్య రుసుముతో జూన్ 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 10 నుంచి 18 వరకు వెబ్సైట్లో హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని ఉన్నత విద్యామండలి (టీఎస్సీహెచ్ఈ) వెల్లడించింది. ఈ పరీక్షలను హైదరాబాద్, వరంగల్ ప్రాంతీయ కేంద్రాల్లో నిర్వహించనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm