హైదరాబాద్ : జీపు అదుపుతప్పి బోల్తాపడటంతో ఏడేండ్ల చిన్నారి మృతిచెందగా.. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ బస్టాండ్ వద్ద ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. జీపు నిర్మల్ నుంచి ప్రయాణికులతో బైంసా వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నిర్మల్ ప్రాంతీయ దవాఖానకు తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ప్రమాదానికి గల కారణంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm