హైదరాబాద్ : శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో ఆదివారం తెల్లవారుజామున నిద్రిస్తున్న సమయంలో గుండె సంబంధిత సమస్య రావడంతో సోమాజిగూడలోని యశోద దవాఖానకు తీసుకెళ్లారు. వైద్యులు చికిత్స చేయడంతో కోలుకున్నారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి దవాఖానకు వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గుత్తాను పరామర్శించిన వారిలో మంత్రి వెంట రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, గాదరి కిశోర్కుమార్, చిరుమర్తి లింగయ్య ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm