- మల్టీ ఏజెన్సీల యాజమాన్యాలతో జూమ్ మీటింగ్ నిర్వహించిన పోలీస్ కమిషనర్
నవతెలంగాణ కంటేశ్వర్
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో బిజినెస్ అసోసియేషన్, ప్రొఫెసర్,రోటరీ క్లబ్, డాక్టర్స్ అసోసియేషన్, రైస్ మిల్ అసోసియేషన్, మర్చంట్ అసోసియేషన్, ఛాంబర్ ఆఫ్ కామర్స్, హోల్ సేల్ అసోసియేషన్, విజయ డైరీ అసోసియేషన్, థియేటర్స్ అసోసియేషన్, కూరగాయల మార్కెట్ అసోసియేషన్ తదితర యాజమాన్యాలతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ మాట్లాడుతూ దేశంలో రోజురోజుకు కరోనా మహమ్మారి ఉన్నందున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అత్యవసర సేవలకు సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని అందులో భాగంగా మాస్కులు ధరించే వారికి మాత్రమే షాపులోకి అనుమతి ఇవ్వాలని అని తెలియజేయాలని, తప్పకుండా గోడలని కరోనా నిబంధనలు తెలియజేసి ఫ్లెక్సీలను తమ షాపు ముందు భాగంలో ఏర్పాటు చేయాలని తెలియజేశారు శుభకార్యాలు పండుగలు జరిగే సమయంలో ప్రజలు కొవిడ్-19 నిబంధనలు పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే 45 సంవత్సరాలు నిండిన వారు కావిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ రవీంద బాబు, మున్సిపల్ కమిషనర్ జితేష్ పాటిల్, ఐఏఎస్ నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ అధికారి రవి, నిజామాబాద్ అదనపు డిసిపి శ్రీనివాస్ కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఇన్ స్పెక్టర్ రాఘవేందర్,దర్శన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 11 Apr,2021 08:24PM