హైదరాబాద్: కోల్కతా నైట్రైడర్స్తో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. స్వల్ప స్కోరుకే ఓపెనర్ల వికెట్లు చేజార్చుకుంది. భారీ లక్ష్య ఛేదనకు దిగిన సన్రైజర్స్ 10 పరుగులకే ఓపెనర్లు డేవిడ్ వార్నర్(3), వృద్ధిమాన్ సాహా(7) వికెట్లను కోల్పోయింది. రెండో ఓవర్లోనే వార్నర్ను ప్రసిధ్ కృష్ణ పెవిలియన్ పంపగా.. ఆ తర్వాతి ఓవర్లో మరో ఓపెనర్ సాహాను స్పిన్నర్ షకిబ్ అల్ హసన్ వెనక్కి పంపాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బెయిర్ స్టో ఇన్నింగ్స్ ను చక్కదిద్దుతున్నాడు. ఫోర్లతో స్కోరును పెంచుతున్నాడు. మరో వైపు మనీష్ పాండే బెయిర్ స్టోకి సహకరిస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ జట్టు ఓవర్లకు 77 పరుగులు చేసింది. మనీశ్ పాండే(26), జానీ బెయిర్స్టో(41) క్రీజులో ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm