చెన్నై : పుదుకోట జిల్లాలోని ఆలయ కొలనులో మునిగి ఇద్దరు చిన్నారులు మృతిచెందిన ఘటన విషాదానికి దారితీసింది. గంధర్వకోట సమీపం సొక్కంపేటలో వున్న అంకాళ పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని కొలను వద్ద సోమవారం మధ్యాహ్నం అదే ప్రాంతానికి చెందిన విఘ్నేష్ (8), నివేద(11) ఆడుకుంటున్నారు. స్నానం చేసేందుకు కొలనులోకి దిగిన సమయంలో కాలు జారి లోతైన ప్రాంతంలో నీటమునిగారు. దీనిని గమనించిన చుట్టుపక్కల వారు అందించిన సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది సాయంతో అక్కడకు చేరుకున్న పోలీసులు ఇద్దరు చిన్నారుల మృతదేహాలను వెలికితీసి, ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm