భువనేశ్వర్ : కరోనా నివారణకు మాస్కే ఆయుధమని కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు చెబుతున్న విషయం విదితమే. కానీ మాస్కు ధరించనంత మాత్రాన పోలీసుల కూడా ప్రజలను చావబాదుతున్నారు. ఒడిశా భద్రక్ జిల్లాలోని ఓ దేవాలయానికి శుభరంజన్ మేకప్ తన కుటుంబ సభ్యులతో వెళ్లాడు. అయితే శుభరంజన్ మాస్కు పెట్టుకోలేదు. దీంతో అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు.. ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని చితకబాదారు. ఈ సన్నివేశాలను అక్కడున్న ఓ వ్యక్తి తన మొబైల్లో రికార్డు చేశాడు. తన కుమారుడిపై చేయి చేసుకున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని భద్రక్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. రికార్డు చేసిన సన్నివేశాల ఆధారంగా చర్యలు తీసుకుంటామని భద్రక్ ఎస్పీ చరణ్ మీనా పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm