హైదరాబాద్ : భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో నేటి నుంచి శ్రీరామనవమి, తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 27వరకు కొనసాగనున్నాయి. కరోనా వేళ ఉత్సవాలు నిరాడంబరంగా సాగనున్నాయి. బ్రహ్మోత్సవాల దృష్ట్యా 27వ తేదీ వరకు నిత్య కల్యాణాలను నిలిపివేశారు. ప్లవ నామ సంవత్సరం ఉగాది సందర్భంగా మంగళవారం ఉదయం మూలమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఉగాది ప్రసాద వితరణ, సాయంత్రం నూతన పంచాంగ శ్రవణం కార్యక్రమాలు జరుగనున్నాయి. అలాగే తిరువీధి సేవలు ప్రారంభం కానున్నాయి. బుధవారం భగవద్రామానుజ జయంతోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఐదు రోజుల పాటు రాత్రి ప్రత్యేక సేవాకాలం, విశేష భోగ నివేదన, రాత్రి చుట్టు సేవలు నిర్వహించనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm