లిమా : పెరూలో సిహువాస్ ప్రావిన్స్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు బోల్తాపడడంతో 20 మంది మృతి చెందగా.. మరో 14 మంది గాయపడ్డారు. ఘటనా స్థలంలోనే 18 మంది మృతి చెందగా, మరో ఇద్దరు హాస్పిటల్కు తరలిసుండగా మృతి చెందారని పరోబాంబ మున్సిపాలిటీ తెలిపింది. పాలోసెకో ప్రాంతంలో సోమవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం జరిగిన సాధారణ ఎన్నికల్లో హువాన్చైల్లో ఓటు వేసి పరోబాంబ ప్రాంతాల నుంచి తిరిగి చింబోటే, లిమాకు వెళ్తుండగా ప్రయివేటు ట్రావెల్ బస్సు ప్రమాదవశాత్తు బోల్తాపడినట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అయితే, ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు.
Mon Jan 19, 2015 06:51 pm