జనగామ: జిల్లాలోని రఘునాథపల్లి మండలం నిడిగొండలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న ఇద్దరిపై గుర్తు తెలియని వ్యక్తి గొడ్డలితో దాడి చేశాడు. ఈ దాడిలో వంగాల దినేష్(25) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. దినేష్ బాబాయి మహేష్కు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన వ్యక్తిని చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించారు. కుటుంబసభ్యుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm