ఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాజీవ్కుమార్ను టీడీపీ ఎంపీలు కలిశారు. సోమవారం తిరుపతిలో టీడీపీ నిర్వహించిన సభలో జరిగిన రాళ్ల దాడి ఘటనపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్నాయుడు, కేశినేని నాని, కనకమేడల రవీంద్రకుమార్ వినతిపత్రం అందజేశారు. తిరుపతి ఉపఎన్నికలో కేంద్ర బలగాల పర్యవేక్షణలో పోలింగ్ నిర్వహించాలని ఎంపీలు కోరారు. పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. 2లక్షల నకిలీ ఓటరు కార్డులు ఉన్నాయని.. రెండు అదనపు గుర్తింపు కార్డులు ఉంటేనే ఓటు వేసే అవకాశం ఇవ్వాలని కోరారు. ఎన్నికల ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వంలోని వాలంటీర్లను భాగస్వాములను చేయకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm