భద్రాద్రి కొత్తగూడెం: అక్రమంగా తరలిస్తున్న నిషేధిత గంజాయిని చుంచుపల్లి పోలీసులు పట్టుకున్నారు. గంజాయిని తరలిస్తున్నారనే సమాచారంతో వాహనాల తనిఖీలను పోలీసులు చేపట్టారు. చింతూరు నుంచి హైదరాబాద్కు వెళుతున్న వ్యాన్లో పోలీసులకు గంజాయి దొరికింది. పట్టుకున్న గంజాయి విలువ దాదాపు రూ.3 కోట్ల విలువ ఉంటుందని పోలీసులు తెలిపారు. వ్యాన్ డ్రైవర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm