చండీగఢ్: చండీగఢ్లో కరోనా మహమ్మారి మరింత విజృంభిస్తుండడంతో అధికారులు ఇవాళ ప్రముఖ పర్యాటక ప్రాంతం రాక్ గార్డెన్ను మూసివేశారు. ప్రతి వారంతంలో సుఖ్నా లేక్ను కూడా మూసివేయనున్నట్టు ప్రకటించారు. దీంతో పాటు ప్రతిరోజూ రాత్రి 10:30 బదులు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించనున్నట్టు అధికార యంత్రాంగం పేర్కొంది. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పంజాబ్ గవర్నర్, చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ వీపీ సింగ్ బదోరే ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm