చెన్నై: కోల్కతా నైట్ రైడర్స్ ముందు ముంబయి ఇండియన్స్ 153 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ముంబయి 19.5 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. రసెల్ 15 పరుగులకే ఐదు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ముంబయి బ్యాట్స్మెన్లో సూర్యకుమార్ యాదవ్ (56; 36 బంతుల్లో 7x4, 2x6) టాప్స్కోరర్గా నిలిచాడు. ఆదిలోనే ఓపెనర్ క్వింటన్ డికాక్(2) నిరాశపర్చినా.. రోహిత్(43; 32 బంతుల్లో 3x4, 1x6)తో కలిసి సూర్య ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. వీరిద్దరూ రెండో వికెట్కు 76 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే, ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని షకిబ్ అల్ హసన్ విడదీశాడు. 10.3 ఓవర్కు ఓ చక్కటి డెలివరీతో సూర్యను పెవిలియన్ పంపాడు. దాంతో ముంబయి 86 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. అనంతరం వచ్చిన ఇషాన్ కిషన్(1) తర్వాతి ఓవర్లోనే ఔటయ్యాడు. కమిన్స్ బౌలింగ్లో ప్రసిద్ధ్ కృష్ణ చేతికి చిక్కాడు. అప్పటికి ముంబయి స్కోర్ 88/3. కాసేపటికే కెప్టెన్ రోహిత్ సైతం కమిన్స్ బౌలింగ్లో బౌల్డయ్యాడు. తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్య(15), కీరన్ పోలార్డ్ (5) నిరాశ పరిచారు. చివర్లో కృనాల్ పాండ్య(15) బౌండరీలు బాదడంతో జట్టు స్కోర్ 150 దాటింది.
Mon Jan 19, 2015 06:51 pm