న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభన తీవ్ర స్థాయికి చేరుతోంది. ఒక్క రోజులోనే ఏకంగా 1,027 మందిని పొట్టనబెట్టుకుంది. గత ఆరు నెలలుగా ఒక్క రోజులోనే నమోదైన మరణాలు ఇవే అత్యధికం కావడం గమనార్హం. ఇక రికార్డు స్థాయిలో 24 గంటల్లో ఏకంగా 1,84,372 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా బారిన పడిన వాళ్ల సంఖ్య 1,38,73,825కు చేరుకుంది. తాజాగా 82,339 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కోలుకున్న వాళ్లు 1,23,36,036గా ఉన్నారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 13,65,704 ఉన్నాయి.
వరుసగా నాలుగో రోజూ ఇండియాలో లక్షన్నరకుపైగా కేసులు నమోదయ్యాయి. అమెరికా తర్వాత ఒకే రోజులో ఇన్ని కేసులు వచ్చిన దేశం కూడా ఇండియానే. కరోనా సెకండ్ వేవ్కు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. కేసులు ఆందోళకర స్థాయిలో పెరిగిపోతుండటంతో ఇప్పటికే వివిధ దేశాల్లో అనుమతి పొందిన విదేశీ టీకాల వినియోగానికి గ్రీన్సిగ్నల్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే.