హైదరాబాద్: కరోనా సెకండ్ వేవ్ రాష్ట్రంలో చాలా తీవ్రంగా మారుతోంది. నిన్న 72,634 మందికి పరీక్షలు నిర్వహించగా.. 2157 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఎనిమిది మంది మరణించగా, మరో 821 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,34,738కి చేరింది. ఇందులో 3,07,499 మంది వైరస్ నుంచి కోలుకోగా.. మరో 1,780 మంది మరణించారు. ఇంకా 25,459 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇందులో 16,892 మంది బాధితులు హోం ఐసోలేషన్లో ఉన్నారు. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 361, మేడ్చల్ జిల్లాలో 245, రంగారెడ్డిలో 206 చొప్పున ఉన్నాయి.
రాష్ట్రంలో ఇప్పటివరకు 1,12,53,374 మందికి టెస్టులు చేయగా, మొత్తం 23,12,340 మంది కరోనా టీకా తీసుకున్నారు. ఇందులో 20,10,611 మంది తొలి డోసు వేయించుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 14 Apr,2021 11:21AM