హైదరాబాద్: కరోనా విలయతాండవం చేస్తున్న నేపసథ్యంలో ప్రతీ ఒక్కరూ భయాందోళనకు గురవుతున్నారు. ఏ మాత్రం దగ్గు, జలుబు ఉన్నా దగ్గరలోని పీహెచ్ సీలకు వెళ్లి కరోనా టెస్టులు చేయించుకుంటున్నారు. టెస్ట్ చేయించుకున్న వెంటనే రిజల్ట్ రావడంతో వెంటనే ఇంటికి వెళ్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా టెస్ట్ చేయించుకున్నప్పుడు పాజిటివ్ రావడం.. ఇంటికెళ్లిన తర్వాత మొబైల్ కు నెగిటివ్ రిపోర్ట్ రావడంతో ఆందోళనకు గురవుతున్నారు. ఇలాంటి సంఘటనే లంగర్ హౌస్ పరిధిలోని సన్ సిటీకి చెందిన సుధారాణికి జరిగింది. ఆమె రెండు రోజుల నుంచి జలుబుతో బాధపడుతూ కొవిడ్ టెస్టు కోసం గోల్కొండ ఏరియా హాస్పిటల్కి వెళ్లింది. అక్కడ యాంటిజెన్ టెస్టు చేయించుకుంది. పాజిటివ్వచ్చిందని మెడిసిన్ ఇచ్చి హోమ్ ఐసోలేషన్లో ఉండాలని మెడికల్ సిబ్బంది చెప్పి పంపించారు. సాయంత్రం ఆమె ఫోన్కి నెగెటివ్ రిపోర్ట్ మెసేజ్వచ్చింది. ఆమె ఒక్కసారిగా షాక్ అయింది. నాకు ఇంతకు పాజిటివ్ ఉందా.. నెగెటివ్ ఉందా అర్థం కాక మరో ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి టెస్ట్ ఇచ్చింది.
ఇలా ఒకరికి ఇద్దరికి కాదు.. వందలాది మందికి ఇలాగే వస్తున్నాయి. వాటిని చూసుకున్న బాధితులు తమకు కరోనా వచ్చిందా? రాలేదా? అని ఆందోళన చెందుతున్నారు. వెంటనే ప్రైవేటు సెంటర్లకు వెళ్లి మరోసారి టెస్టులు చేయించుకుంటున్నారు. మరికొందరు నెగెటివ్వచ్చిందని ఇష్టానుసారంగా బయట తిరుగుతున్నారు. మెడికల్ సిబ్బంది పొరపాట్లతోనే రిజల్ట్ సరిగా తెలియడం లేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులను అడిగితే టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల మెసేజ్లు తప్పుగా వస్తున్నట్లు, సెంటర్ వద్ద చెప్పిందే నిజమని పేర్కొంటున్నారు. మెసేజ్లు వస్తున్న వారికి తప్పుడు రిపోర్టుల వస్తుంటే కొంతమందికి మెసేజ్లే రావడం లేదు. హైదరాబాద్ లో ప్రతీ రోజు దాదాపు 12 వేల టెస్టులు నిర్వహిస్తున్నారు. ఇందులో వెయ్యి మందికి మెసేజ్ లు రావడం లేదు సెంటర్ వద్ద ఎక్కువ మంది ఉండడంతో కొందరికి రిజల్ట్ చెప్పలేకపోతున్నారు. అలాంటి వారికి మెసేజ్ రాకపోతే రిజల్ట్ ఏదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఒక్కో పీహెచ్ సీ సెంటర్కి నిత్యం వందలాది మంది వస్తుండడంతో ఫోన్ నంబర్లు రాసుకునే సమయంలో మెడికల్ సిబ్బంది తప్పుగా తీసుకుంటున్నారు. టెక్నికల్ ప్రాబ్లమ్స్తో పాటు సిబ్బంది తప్పిదాల వల్ల కూడా మెసేజ్లు రావడం లేదు. ఇలాంటి తప్పిదాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ సెంటర్లను చాలా మంది నమ్మడం లేదు. తప్పుడు రిపోర్టులు వస్తున్న వారిలో చాలా మంది తిరిగి ప్రైవేట్ సెంటర్లలో టెస్టులు చేయించుకుంటున్నారు. ఇలా రెండు రిజల్ట్ లు వస్తున్నాయని మరుసటి రోజు అదే సెంటర్ కి వెళ్తే మళ్లీ టెస్ట్ చేయడం కుదరదు అనటంతో మరో సెంటర్ కి వెళ్తున్నారు. ఇలా అయోమయానికి ప్రజలు గురవుతున్నారు. అయితే కొత్త యాప్తోనే ఇలాంటి సమస్యలు వస్తున్నట్టు మెడికల్ ఆఫీసర్లు చెబుతున్నారు. ఏదేమైనా సెంటర్ లో చెప్పిన రిజల్ట్ మాత్రమే నమ్మాలని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 14 Apr,2021 06:57PM