ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్ను విజయంతో మొదలు పెట్టిన ఢిల్లీ క్యాపిటల్స్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ అన్రిచ్ నోర్జే కరోనా బారిన పడ్డాడు. లీగ్లో పాల్గొనేందుకు సహచరుడు కగిసో రబాడాతో కలిసి ఆలస్యంగా భారత్కు వచ్చిన నోర్జే.. బీసీసీఐ నిబంధనల ప్రకారం వారం రోజుల క్వారంటైన్లో ఉన్నాడు. అయితే క్వారంటైన్ పూర్తయిన తర్వాత నిర్వహించిన పరీక్షల్లో అతనికి పాజిటివ్గా తేలిందని జట్టు వర్గాలు వెల్లడించాయి.
దీంతో నోర్జే మరో 10 రోజులు ఐసోలేషన్లో ఉండాల్సి ఉంటుంది. ఈ లెక్కన అతను మరో రెండు, మూడు మ్యాచ్లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. అయితే, నోర్జే కరోనా బారిన పడిన విషయాన్ని ఢిల్లీ యాజమాన్యం అధికారికంగా వెల్లడించకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. గతంలో కేకేఆర్ ఆటగాడు నితీశ్ రాణా, బెంగళూరు ఓపెనర్ పడిక్కల్ కోవిడ్ బారిన పడ్డ సందర్భంలో ఆయా జట్ల యాజమాన్యాలు అధికారికంగా ధృవీకరించాయి.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 14 Apr,2021 08:11PM