తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కరోనా నుంచి కోలుకున్నారు. కోజికోడ్ ప్రభుత్వ వైద్య కళాశాల నుంచి బుధవారం ఆయన డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సిబ్బందికి సీఎం అభివాదం చేశారు. విజయన్కు ఈ నెల 8న కరోనా పరీక్ష నిర్వహించగా పాజిటివ్గా రిపోర్ట్ వచ్చింది. దీంతో అదే రోజు ఆయన ఆసుపత్రిలో చేరారు. వారం రోజులపాటు చికిత్స పొందిన విజయన్ కరోనా నుంచి కోలుకున్నారు. ఈ నేపథ్యంలో కోజికోడ్ ప్రభుత్వ వైద్యులు ఆయనను బుధవారం డిశ్చార్జ్ చేశారు. కేరళలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 11.8 లక్షలకు, మరణాలు 4,800కు చేరాయి.
Mon Jan 19, 2015 06:51 pm