కూకట్పల్లి: ప్రముఖ రంగస్థల నటుడు, యువకళావాహిని వ్యవస్థాపకులు, సాంస్కృతిక దిగ్గజం వై.కె.నాగేశ్వరరావు కూకట్పల్లిలో బుధవారం గుండెపోటుతో మరణించారు. మూడురోజులుగా దగ్గు, తీవ్ర జలుబుతో బాధపడుతూ కూకట్పల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. సాయంత్రం ఒక్కసారిగా పల్స్ పడిపోవడంతో గుండెపోటుతో మృతి చెందారు. మృతదేహాన్ని కూకట్పల్లి జయానగర్లోని ఆయన ఇంటికి తీసుకొచ్చారు. నాగేశ్వరరావు మృతి సాంస్కృతిక రంగానికి తీరని లోటని పలువురు బాధను వ్యక్తం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm