జనశంకరి : డబ్బు, నగల కోసం బెంగళూరు పుట్టేనహళ్లిలో జంటహత్యలకు పాల్పడిన ఘరానా నేరస్తుడిని పోలీసులు కాల్పులు జరిపి అరెస్ట్ చేశారు. నిందితుడు కోణనకుంటె నివాసి మంజునాథ్ అలియాస్ అంబారి. ఇతనిపై ఇప్పటికే పలు దోపిడీ, దొంగతనాలతో పాటు వివిధ పోలీస్స్టేషన్లులో 9 కేసులు ఉన్నాయి. జేపీ నగర 7వ ఫేజ్ పుట్టేనహళ్లి సంతృప్తి లేఔట్లో పశ్చిమ బెంగాల్కు చెందిన మమతాబసు (71), ఆమె కుమారుని స్నేహితుడైన ఒడిశావాసి దేవబ్రత బెహరా (41) ఈ నెల 7 తేదీన రాత్రి దారుణ హత్యకు గురికావడం తెలిసిందే. అప్పటినుంచి పోలీసులు దర్యాప్తు చేశారు.కాగా ఎట్టకేలకుమంజునాథ్నుపోలీసులు అరెస్టుచేశారు.
Mon Jan 19, 2015 06:51 pm