చెన్నై : నగర శివారు ప్రాంతాలైన చిట్లపాక్కం, శ్రీపెరంబుదూరులలో చెరువు, కొలనుల్లో మునిగి ముగ్గురు స్టూడెంట్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర ఘటనలతో మృతుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఈస్ట్ తాంబరం, రామకృష్ణాపురానికి చెందిన సునీల్ కుమార్(12) అనే బాలుడు అదే ప్రాంతంలో ఆరో తరగతి చదువుతున్నాడు. అదే ప్రాంతానికి చెందిన విషాంత్ (12), గోకుల్ (12) అనే ఇద్దరు సునీల్తో కలిసి మంగళవారం సాయంత్రం ఆట్లాడుకునేందుకు వెళ్లారు. ఈ ముగ్గురు రాత్రి పోద్దుపోయేం తవరకు తిరిగిరాలేదు. వీరు చిట్లప్పాక్కం పెద్ద చెరువు సమీపంలో ఆడుకుంటుండగా తాము చూసినట్టు కొందరు స్థానికులు చెప్పారు. దీంతో చెరువు వద్దకు వెళ్లి గాలించగా, చెరువు గట్టుపై ఈ ముగ్గురు విద్యార్థుల దుస్తులు వుండటాన్ని గమనించారు. అగ్నిమాపకదళ సిబ్బంది చెరువులో గాలించి మూడు మృతదేహాలను మంగళవారం రాత్రి వెలికి తీశారు.
Mon Jan 19, 2015 06:51 pm