న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా రెండు లక్షలకు సమీపంలో కరోనా కేసులు నమోదయ్యాయంటే తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా డాక్టర్లు తెలిపిన వివరాల ప్రకారం కరోనా సోకిన వ్యక్తిలో వ్యాధి ప్రభావం చూపు, వినికిడి శక్తిపై పడుతోంది.
కరోనా కొత్త స్ట్రెయిన్ సోకినపుడు జ్వరంతో పాటు డయేరియా, కడుపునొప్పి, వాంతులు, గ్యాస్, ఎసిడిటీ, ఆకలి వేయకపోవడం, ఒంటి నొప్పులు మొదలైన లక్షణాలు కనిపిస్తాయని తెలిసిందే.అయితే కేజీఎంయూ, ఎస్జీపీజీఐతో పాటు పలు కొవిడ్ ఆసుపత్రులలో చేరిన బాధితుల్లో చూపు మందగించడంతోపాటు వినికిడి లోపం లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ విషయం నిపుణుల పరిశోధనలో తేలింది. కరోనా కొత్త రూపం దాల్చడంతో నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 15 Apr,2021 10:16AM