న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా టీకా పంపణీ జోరుగా కొనసాగుతోంది. బుధవారం రాత్రి 8 గంటల వరకు మొత్తం 11.43 కోట్ల డోసుల వ్యాక్సిన్ వేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మూడు రాష్ట్రాల్లో టీకాల పంపిణీ కోటి మార్క్ దాటినట్టు పేర్కొంది. మహారాష్ట్రలో 1,11,19,018, రాజస్థాన్ లో 1,02,15,471, ఉత్తర ప్రదేశ్ లో 1,00,17,650 వ్యాక్సిన్ డోసులు వేసినట్టు తెఇపింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 69,974 టీకా కేంద్రాలు పని చేస్తున్నాయని తెలిపింది. పని ప్రాంతాల్లోనూ టీకాలు వేస్తున్నందున లబ్ధిదారుల సంఖ్య అధికంగా ఉందని మంత్రిత్వశాఖ చెప్పింది. బుధవారం రాత్రి 8 గంటల వరకు 11,43,18,455 డోసులు వేసినట్లు కేంద్రం తెలిపింది. ఇందులో 90,63,976 మంది ఆరోగ్య కార్యకర్తలు మొదటి డోసు.. మరో 56,03,568 మంది రెండో డోసు తీసుకున్నట్లు వివరించింది.
Mon Jan 19, 2015 06:51 pm