హైదరాబాద్: తెలంగాణలో పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై గురువారం కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఈ మేరకు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇవాళ ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. ఇప్పటికే సీబీఎస్ ఈ పదో తరగతి పరీక్షలు రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని విద్యార్థులు, తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. పరీక్షల నిర్వహణపై ఈరోజు నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Mon Jan 19, 2015 06:51 pm