రాజస్థాన్ : పాకిస్తాన్ నుంచి భారత్కు డ్రగ్స్ చేరవేస్తున్నారన్న పక్కా సమాచారంతో.. గుజరాత్ తీరంపై పోలీసులు, కోస్ట్ గార్డ్ సిబ్బంది గట్టి నిఘా పెంచారు. ఈ క్రమంలో జఖువా తీరంలో ఓ అనుమానాస్పద పడవ కనిపించింది. కోస్ట్ గార్డ్ సిబ్బందితో పాటు గుజరాత్ పోలీస్ శాఖకు చెందిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఆ బోటును ఆపేందుకు ప్రయత్నించారు. వీరిని చూసి బోటు పరుగులు పెట్టడంతో.. చేజ్ చేసి మరీ పట్టుకున్నారు. మొత్తం తనిఖీ చేస్తే భారీ మొత్తంలో డ్రగ్స్ దొరికాయి. బోటులో మొత్తం 30 కేజీల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అంతర్జాతీయ మార్కెట్లో దాని విలువ సుమారు రూ.150కోట్ల వరకు ఉంటుంది. డ్రగ్స్తో పాటు పాకిస్తాన్కు చెందిన ఓ బోటును అధికారులు సీజ్ చేశారు. అందులో ప్రయాణిస్తున్న 8 మంది పాకిస్తాన్ పౌరులను అరెస్ట్ చేశారు. డ్రగ్స్ను ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ఎక్కడికి తరలిస్తున్నారు? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm