హైదరాబాద్ : తెలంగాణలో మినీ పురపోరుకు సర్వం సిద్ధమైంది. రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, అచ్చంపేట, సిద్దిపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్ మున్సిపాలిటీలకు ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరగనుంది. మే 3వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. రేపట్నుంచి ఈ నెల 18 వరకు నామినేషన్ల స్వీకరిస్తారు. 19న అభ్యర్థుల నామినేషన్ పత్రాలను పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరితేదీ ఈ నెల 22. కాగా జడ్చర్ల, నకిరేకల్, కొత్తూరు చైర్పర్సన్ల రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. జడ్చర్ల కు బీసీ మహిళ, నకిరేకల్ కు బీసీ జనరల్, కొత్తూరు కు జనరల్ మహిళకు కేటాయించారు.
Mon Jan 19, 2015 06:51 pm