ఢిల్లీ: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారాంతపు కర్ఫ్యూ విధిస్తున్నట్టు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఎల్జీ, ఉన్నతాధికారులు, మంత్రులతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం ప్రకటించారు. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందన్నారు. ఢిల్లీలో ప్రస్తుతం 5 వేల బెడ్స్ అందుబాటులో ఉన్నాయని, బెడ్స్ కొరత లేదని తెలిపారు. సినిమా హాల్లో సీటింగ్ను 30శాతానికి కుదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మాల్స్, జిమ్స్, ఆడిటోరియం, స్పా మూసివేయాలని ఆదేశించారు. విమానయాన, రైల్వే ప్రయాణికులు కచ్చితంగా టికెట్స్ చూపించాలన్నారు. వివాహాలు చేసుకునే వారికి కర్ఫ్యూ పాస్లు జారీ చేస్తామన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm