హైదరాబాద్ : రాష్ట్రంలో కొవిడ్-19కు సంబంధించి ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం బీఆర్కే భవన్లో పలు శాఖల అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సమీక్ష సందర్భంగా సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. కొవిడ్ పేషంట్ల కోసం ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో బెడ్ల సంఖ్యను పెంచడానికి చర్యలు తీసుకోవాలని, కేసులు పెరిగితే ఉత్పన్నమయ్యే పరిస్ధితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు.
Mon Jan 19, 2015 06:51 pm