హైదరాబాద్: వికారాబాద్ జిల్లాలోని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి కరోనా సోకింది. కరోనా లక్షణాలు కనిపించడంతో గురువారం పరీక్షలు చేయించగా కోవిడ్ సోకినట్లు నిర్దారణ అయినట్లు తేలింది. తన స్నేహితుల ద్వారా కరోనా వచ్చినట్లు గుర్తించారు. అయితే ప్రస్తుతం తన ఆరోగ్యం మెరుగ్గానే ఉందని, వైద్యుల సూచన మేరకు హోమ్ ఐసోలేషన్లో ఉన్నట్లు చెప్పారు. పార్టీ శ్రేణులు, నాయకులు, అభిమానులు ఎవరు కూడా తనను కలవడానికి రావద్దని, ఎవరు ఆందోళన కూడా పడొద్దని కోరారు. అంబేద్కర్ జయంతి సందర్బంగా తాండూరు పర్యటనలో తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కరోనా రెండో దశ వేగంగా విస్తరిస్తున్నందున అందరూ మాస్కులు ధరించి, కొవిడ్ నిబంధలను పాటించాలని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm