హైదరాబాద్: పంజాగుట్టలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలంటూ నిరవధిక దీక్షకు దిగిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు (వీహెచ్) దీక్ష విరమించారు. తన నివాసంలోనే ఆయన నాలుగు రోజులుగా దీక్ష కొనసాగించారు. ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని దీక్ష విరమించాలన్సిందిగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణికం ఠాగూర్ వీహెచ్కు సూచించారు. దీంతో మాణికం ఠాగూర్ ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా మాణికం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు విషయంలో సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు సరిగాలేదని విమర్శించారు. 70 రోజుల వయసులో వీహెచ్ నిరాహార దీక్షకు దిగారని.. కరోనా సమయంలో దీన్ని కొనసాగించడం సరికాదని భావించి ఆయనతో విరమింపజేశామన్నారు. వీహెచ్ వెంట కాంగ్రెస్ ఉంటుందని చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm