తేజా హానుమాన్ బ్యానర్లో శంకర్ కొప్పిశెట్టి నిర్మాతగా , సాయికృష్ణ తల్లాడ దర్శకత్వంలో తెరక్కెక్కిన సినిమా "నిన్ను చేరి". ఏప్రిల్ 14న ఊర్వశి ఓటిటి లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుని , హిట్ టాక్ తెచ్చిన సందర్భంగా మీడియా తో తన ఆనందాన్ని పంచుకున్నారు "నిన్ను చేరి" సినిమా డైరెక్టర్ తల్లాడ సాయికృష్ణ. ఈ సందర్భంగా సాయికృష్ణ మాట్లాడుతూ ముందుగా మా ప్రొడ్యూసర్ శంకర్ గారికి, మా టీం కి ప్రత్యేక ధన్యవాదాలు.కరోనా విజృంభన ఎక్కువగా ఉండడం వలన మేము ఈ సినిమా ని ఊర్వశి ఓటిటి లో ఏప్రిల్ 14న విడుదల చేసాం, సినిమా విడుదలైనప్పటి నుండి సినిమా చూసిన ప్రతి ఒక్కరు చాలా బాగుంది అని అంటున్నారు, అలానే మా టీం లో హిరో హీరోయిన్లు గా రాజు ఆనేం, మాధురి చేశారు , గౌతమ్ రాజు ,భద్రం, కిషోరో దాసు,జబర్దస్త్ శాంతి స్వరూప్ ,శోభన్ బాబు భోగరాజు, బేబీ హాసిని ఇలాంటి సీనియర్ నటులు ఉండడం వలన సినిమా ప్రేక్షకుల్ని మెప్పిస్తుందని అర్థం అవుతుంది. ఇంకా సినిమా చూడని ప్రేక్షకులు మా సినిమా చూసి మీ ఫీడ్ బ్యాక్ ఇవ్వాలని కోరుతున్నాను అని అన్నారు. ఈ సినిమా కి కథ మాటలు శివ కాకు, సంగీతం వి.ఆర్.ఏ.ప్రదీప్.
Mon Jan 19, 2015 06:51 pm