హైదరాబాద్: సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట మండలంలోని నందికంది గ్రామంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. గ్రామ శివార్లలో శుక్రవారం ఉదయం 26 ఏళ్ల ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. మృతుడిని కాసులవాడి వంశీగా గుర్తించారు. డీఎస్పీ ఏ.బాలాజీ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్నిఫర్ డాగ్ను రంగంలోకి దించారు. బండరాయితో బలంగా కొట్టి చంపినట్లుగా పోలీసులు ప్రాథమికంగా అవగాహనకు వచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సదాశివపేట ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm